న్యూఢిల్లీ: భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం నెల రోజులు పొడిగించింది. ఇది దాదాపు 50 ఏళ్ల తర్వాత జరిగిన అత్యంత అరుదైన నిర్ణయం. జనరల్ పాండే ఈ నెల 31న పదవీ విరమణ చేయవలసి ఉంది.
ఆయన పదవీ కాలాన్ని జూన్ 30 వరకు పొడిగించేందుకు క్యాబినెట్ నియామకాల కమిటీ మే 26న ఆమోదించినట్లు రక్షణ శాఖ తెలిపింది. పాండే 2022 ఏప్రిల్లో ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు.