AAP | న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హర్యానాలో ఆదివారం తమ పార్టీ రెండు రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకోనేందుకు ఈసీకి చెందిన సువిధ పోర్టల్లో అనుమతి కోరగా.. అందుకు అధికారులు దుర్భాషలాడుతూ తిరస్కరించారని ఆప్ ఆరోపించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం హర్యానా ఎన్నికల ప్రధాన అధికారిని నివేదిక కోరినట్టు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.
కైథాల్ ఏఆర్వో యూజర్ ఐడీని గుర్తు తెలియని వ్యక్తులు దుర్వినియోగం చేశారని అధికారులు తెలిపారు. కాగా, సంబంధిత ఏఆర్వోను గవర్నర్ శనివారం సస్పెండ్ చేశారు.