HomeNationalThe Center Is Planning To Exclude Tribals From The Common Civil Code Ucc
యూసీసీ నుంచి గిరిజనులకు మినహాయింపు!
గిరిజనులను ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) నుంచి మినహాయించేందుకు కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. సోమవారం యూసీసీపై నిర్వహించిన పార్లమెంటరీ ప్యానెల్ సమావేశంలో బీజేపీ ఎంపీ, ప్యానెల్ చైర్మన్ సుశీల్ మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు.
న్యూఢిల్లీ: గిరిజనులను ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) నుంచి మినహాయించేందుకు కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. సోమవారం యూసీసీపై నిర్వహించిన పార్లమెంటరీ ప్యానెల్ సమావేశంలో బీజేపీ ఎంపీ, ప్యానెల్ చైర్మన్ సుశీల్ మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. అలా చేస్తే అది ఉమ్మడి పౌర స్మృతి ఎలా అవుతుందని ఒక ఎంపీ ప్రశ్నించారు.
భావోద్వేగాలతో కూడిన ఈ అంశంపై తాజాగా సంప్రదింపులు అవసరం లేదని కాంగ్రెస్ ఎంపీ వివేక్ తన్ఖా, డీఎంకే ఎంపీ పీ విల్సన్ లిఖిత పూర్వక ప్రకటనలో పేర్కొన్నారు. గత లా కమిషన్ యూసీసీ అవసరం లేదని తెలిపిన విషయాన్ని విపక్ష ఎంపీలు కేంద్రానికి గుర్తు చేశారు. కొన్ని ఈశాన్య రాష్ర్టాలు వాటి సమ్మతి తెలపకపోతే ఆయా చట్టాలను అక్కడ అమలు చేయలేమన్న విషయం సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం. కాగా, యూసీసీపై 19 లక్షల సలహాలు అందాయని లా కమిషన్ అధికారులు తెలిపారు.