న్యూఢిల్లీ: జైళ్లపై భారం తగ్గించడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నట్టు జరిమానా లేదా బెయిల్ సొమ్ము చెల్లించలేని పేద ఖైదీలకు ఆర్థిక సాయం అందించనుంది.
‘సామాజికంగా వెనుకబడినవారు, తక్కువ చదువుకున్నవారు, తక్కువ ఆదాయం కలిగి ఉన్న పేద ఖైదీలకు ఈ కార్యక్రమం ఉపశమనం కలిగిస్తుంది’ అని కేంద్ర హోం శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కార్యక్రమం అమలు కోసం ఈ-ప్రిజన్స్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తామని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను బలోపేతం చేస్తామని కేంద్రం తెలిపింది.