Delhi Ordinance | న్యూఢిల్లీ, జూలై 20: ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన కేసును రాజ్యాంగ ధర్మాసనానికి కేటాయించనున్నారు.
ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తుందని సీజేఐతో కూడిన ధర్మాసనం గురువారం వెల్లడించింది. దీనిపై మీ వైఖరి తెలియజేయాలంటూ గతంలోనే కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీపై అధికారం కోసం ఇటీవల కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఆర్డినెన్స్పై స్టే విధించడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.