న్యూఢిల్లీ, డిసెంబర్ 25: రైళ్లు పట్టాలు తప్పుతున్న ఘటనలకు రైల్వే ట్రాకుల నిర్వహణలో వైఫల్యమే ప్రధాన కారణమని కాగ్ పేర్కొన్నది. మెజార్టీ ఘటనలు దీనివల్లే చోటుచేసుకొంటున్నాయని, ఇందుకు భారతీయ రైల్వే ఇంజినీరింగ్ విభాగానిదే బాధ్యత అని తన నివేదికలో తెలిపింది.
ట్రాకుల నిర్వహణకు బలమైన పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని రైల్వే శాఖకు సూచించింది. 2017-2021 మధ్య రైళ్లు పట్టాలు తప్పిన ఘటనలపై కాగ్ ఓ నివేదిక తయారు చేసింది. ట్రాకుల నిర్వహణ సరిగా లేకపోవడం, అధిక స్పీడ్, మెకానికల్ వైఫల్యాలు వంటివి కారణాలుగా పేర్కొన్నది. మొత్తం 422 ఘటలను చోటుచేసుకొంటే, ఇందులో ట్రాకుల నిర్వహణకు సంబంధించిన కేసులు 171 ఉన్నాయని తెలిపింది.