Kangana Ranaut | న్యూఢిల్లీ, మార్చి 24: బీజేపీ ఆదివారం 111 మందితో లోక్సభ అభ్యర్థుల ఐదో విడత జాబితాను విడుదల చేసింది. ఆదివారమే కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన నవీన్ జిందాల్కు హర్యానాలోని కురుక్షేత్ర స్థానం కేటాయించింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు హిమాచల్ప్రదేశ్లోని మండి, ఇటీవల కలకత్తా హైకోర్టు జడ్జిగా రాజీనామా చేసిన అభిజిత్ గంగోపాధ్యాయ్కు పశ్చిమబెంగాల్లోని తామలుక్ టికెట్లు ఇచ్చింది.
ఐదో జాబితాలో బీజేపీ తెలంగాణలోని వరంగల్, ఖమ్మం స్థానాలకు వరుసగా ఆరూరి రమేశ్, తాండ్ర వినోద్ రావులను అభ్యర్థులుగా ప్రకటించింది. ఏపీలోబీజేపీ పోటీచేస్తున్న ఆరు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. కేరళలోని వయనాడ్లో రాహుల్ గాంధీకి పోటీగా కే సురేంద్రన్ను తమ పార్టీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. యూపీలోని సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీకి టికెట్ దక్కగా.. పిలిబిత్ స్థానంలో వరుణ్ గాంధీకి మొండిచేయి చూపింది.