న్యూఢిల్లీ: న్యాయ విచారణలో జరిగిన సుదీర్ఘమైన జాప్యంతో కలిగిన నష్టాన్ని తెలియజేస్తూ.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 1984 నాటి హత్య కేసులో 100 ఏండ్ల వృద్ధుడ్ని నిర్దోషిగా పేర్కొంటూ విడుదల చేసింది.
1984లో హమీర్పూర్లోని సెషన్స్ కోర్టు ఓ హత్య కేసులో ధనిరామ్ అనే వ్యక్తికి జీవిత ఖైదు శిక్షను విధించింది. అయితే కింది కోర్టు తీర్పును అతడు హైకోర్టులో అప్పీల్ చేయగా, 40 ఏండ్లుగా పెండింగ్లోనే ఉండిపోయింది.