న్యూఢిల్లీ, మే 20: ప్రధాని మోదీ విద్యార్హతను ప్రస్తావిస్తూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యంగ్యంగా రాసిన కవితను ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పేదలు అక్షరాస్యులైతే.. విద్వేష కుతంత్రాలు సాగవంటూ, వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. జైలుకు పంపినా, ఉరి తీసినా ప్రజలను చైతన్యవంతులను చేసే ఈ పోరు ఆగదని ఆయన పేర్కొన్నారు. పేదలు విద్యావంతులైతే నాలుగో తరగతి పాసైన రాజుగారి రాజమహల్ (చౌథీ పాస్ రాజా కా రాజమహల్) పునాదులు కదులుతాయంటూ కవితాస్ర్తాన్ని ఎక్కుపెట్టారు.