Man kills mother | భోజనం రుచికరంగా లేదన్న కారణంతో ఓ కుమారుడు తన తల్లిని దారుణంగా హత్య చేశాడు (Man kills mother). ఈ ఘటన మహారాష్ట్ర థానే (Thane)లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ముర్బాద్ తాలూకాలోని వేలు గ్రామంలో తల్లీ (55), కుమారుడు నివసిస్తుంటారు. అయితే, ఇంట్లోని పలు సమస్యలపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆదివారం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సాయంత్రం సమయంలో ఇంటికి వచ్చిన కుమారుడికి తల్లి భోజనం వడ్డించింది. అయితే ఆ భోజనం రుచికరంగా లేదంటూ ( tasty food) తల్లితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయి ఆమె మెడపై కొడవలితో దారుణంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
స్పందించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత నిందితుడు అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, సమీప బంధువు ఒకరు వెంటనే గుర్తించి యువకుడిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడు దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని.. నిందితుడు ఆసుపత్రిలో ఉండటంతో ఇంకా అరెస్ట్ చేయలేదని వెల్లడించారు.
Also Read..
Assaulted | కన్నకూతుళ్లపై లైంగిక వేధింపులు.. ప్రియుడికి సహకరించి కటకటాలపాలైన తల్లి
Malla Reddy | మహేశ్బాబు బిజినెస్మ్యాన్ సినిమా చూసే రాజకీయాల్లోకి వచ్చా : మల్లారెడ్డి
Malla Reddy | వచ్చే ఐదేళ్లలో హాలీవుడ్, బాలీవుడ్ను తెలుగు ప్రజలే శాసిస్తారు : మంత్రి మల్లారెడ్డి