పుణె: భారత విదేశాంగ విధానంలో 2014 నుంచి మార్పు వచ్చిందని, ఆ రీతిలోనే ఉగ్రవాద(Terrorism) అంశాన్ని డీల్ చేసినట్లు కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. వై భారత్ మ్యాటర్స్.. ఆపర్చునిటీ ఫర్ యూత్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ సినారియో అన్న టాపిక్పై పుణెలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏ దేశంతో సంబంధాలను నెలకొల్పడం కష్టంగా ఉంటుందని మంత్రి ఓ ప్రశ్న వేశారు. దానికి ఆయన సమాధానం ఇస్తూ పాకిస్థాన్ అని అన్నారు. పొరుగు దేశంతో ఉన్న సంబంధాలకు మనమే కారణమని ఆయన పేర్కొన్నారు. 1947లో కాశ్మీర్ను పాక్ ఆక్రమించిందని, దానికి భారతీయ ఆర్మీ కౌంటర్ ఇచ్చిందని, ఆ తర్వాత దేశం ఏర్పడిందన్నారు. పాకిస్థాన్ వాడుతున్న ఉగ్రవాదం గురించి ఐక్యరాజ్యసమితిలో తొలి రోజుల్లో చెప్పలేదన్నారు.
ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. విదేశాంగ విధానంలో మార్పు గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 50 శాతం యధావిధిగా ఉందని, మరో 50 శాతం మారినట్లు ఆయన చెప్పారు. ఉగ్రవాదం విషయంలో మార్పు చెందినట్లు ఆయన తెలిపారు. ఒకవేళ ముంబై అటాక్ లాంటి ఘటన ఇప్పుడు జరిగితే, ఒకవేళ ఆ ఘటనకు స్పందించకుంటే, అప్పుడు జరగబోయే దాడులను ఎవరు నియంత్రిస్తారని మంత్రి జైశంకర్ అన్నారు. బోర్డర్ బయట ఉన్నామని ఉగ్రవాదులు అనుకోరాదు అని, మమ్మల్ని ఎవరూ టచ్ చేయలేరన్న ఆలోచన తగదు అని, ఉగ్రవాదులు ఎటువంటి రూల్స్ లేకుండా వ్యవహరిస్తుంటారు కాబట్టి.. వాళ్లకు సమాధానం ఇవ్వాలంటే మనం కూడా రూల్స్ పాటించాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు.