శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్లోని రఖామా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు జరిపారు.
ప్రతిగా భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించడంతో ఓ గుర్తు తెలియని టెర్రరిస్టు మతమయ్యాడు. అతడు ఏ సంస్థకు చెందినవాడనే విషయం ఇంకా తెలియరాలేదని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు.
బందిపొరలో గత ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు.