కాబూల్/న్యూఢిల్లీ, జూన్ 18: అఫ్గానిస్థాన్లో సిక్కు గురుద్వారా లక్ష్యంగా భారీ దాడి జరిగింది. పలు పేలుళ్లు సంభవించడమే కాకుండా కాల్పులు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో ఇద్దరు మరణించగా.. ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం కాబూల్లో జరిగింది. తొలుత పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనం గురుద్వారా వద్దకు వస్తుండగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం వరుసగా పలు పేలుళ్లు సంభవించాయి. తర్వాత ఉగ్రవాదులకు, తాలిబన్ ఫైటర్లకు మధ్య కాల్పులు జరిగాయి. తాలిబన్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టామని చెప్పారు. పేలుళ్ల సమయంలో గురుద్వారాలో 30 మంది ఉన్నారని, వారిలో ఇద్దరు మరణించారని తెలిపారు. గురుద్వారాపై ఉగ్రదాడిని ఓ పిరికిపంద చర్యగా ప్రధాని మోదీ అభివర్ణించారు.