న్యూఢిల్లీ, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): మూడో విడత జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తెలంగాణ నుంచి నలుగురు విద్యార్థులు పోలు లక్ష్మీ సాయి లోకేశ్ రెడ్డి, మధుర్ ఆదర్శ్ రెడ్డి, వెలవల్లి వెంకట కార్తికేయ సాయి వైదిక్, జ్యోసుల వెంకట ఆదిత్య 100 పర్సెంటైల్ సాధించారు. దేశవ్యాప్తంగా కేవలం 17 మందే 100 పర్సెంటైల్ సాధించగా అందులో తెలంగాణ నుంచే నలుగురు ఉండటం విశేషం. తెలంగాణలో ఓవరాల్గా జ్యోసుల వెంకట ఆదిత్య టాపర్గా నిలవగా, మధుర్ ఆదర్శ్ రెడ్డి జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉన్నారు. బిజిలి ప్రచోతన్ వర్మ 99.96491 పర్సంటైల్తో ఎస్టీ కోటాలో టాపర్గా నిలిచారు. దివ్యాంగుల కోటాలో కొమ్ము శరణ్య, పల్లె భావన, అంచ ప్రణవిలు 99కి పైగా పర్సంటైల్ సాధించారు. మొత్తం 7.09 లక్షల మంది పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకొన్నారు. 334 నగరాల్లో 915 కేంద్రాల్లో పరీక్ష జరిగింది.