న్యూఢిల్లీ, జనవరి 22: కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరుస్తున్న తెలంగాణ బాలిక పెండ్యాల లక్ష్మీ ప్రియ (14) సోమవా రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం స్వీకరించింది. ఆమెతో పాటు మరో 9 మంది బాలికలు, 9 బాలురకు ఈ పురస్కారాలు లభించాయి.
న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలోరాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం సంపాదించడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యంతోపాటు ఆరోగ్యకరమైన పోటీని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.