National Commission for Women | న్యూఢిల్లీ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha )పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్( Bandi Sanjay )పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ( Rekha Sharma )కు తెలంగాణ ఫుడ్స్ చైర్మన్( Telangana Foods Chairmen ) మేడే రాజీవ్ సాగర్( Rajeev Sagar ) ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పేందుకు కృషి చేసిన మహిళ ఎమ్మెల్సీ కవిత అని తెలిపారు. అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ కోసం 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కోసం ఉద్యమించిన ధీరవనిత అని కొనియాడారు. అలాంటి ఆడపడుచుపై కించపరిచే విధంగా ఈడీ అరెస్టు చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అని పరుష పదజాలంతో బండి సంజయ్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు.
అసలు మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం కల్వకుంట్ల కవిత చేస్తున్న ఉద్యమాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలకు దిగుతున్నారని విమర్శించారు. సంజయ్ మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ మహిళలు, ప్రజలు తలదించుకునే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళ నేడు రోడ్డెక్కి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని వివరించారు.
ఓ మహిళ ప్రజాప్రతినిధి అని చూడకుండా పరుష పదజాలంతో దూషించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్పై చర్యలు తీసుకోని మహిళల హక్కులను కాపాడే విధంగా అలాగే మరొకరు ఈ విధంగా మహిళలను అగౌరవ పరిచేవిధంగా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్ పర్సన్ను కోరినట్లు రాజీవ్ సాగర్ తెలిపారు.
గౌరవ @NCWIndia చైర్మన్ @sharmarekha గారిని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడి హోదాలొ ఉండి @bandisanjay_bjp తెలంగాణ ఆడపడుచు ఎమ్మెల్సీ @RaoKavitha పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను… pic.twitter.com/5TdJCV2BiX
— Rajeev Sagar Meday (@RajeevSagarM) March 11, 2023