రిజర్వేషన్లు, కులగణనపై చర్చ
హైదరాబాద్, మే13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యులు శుభప్రదపటేల్, కిశోర్గౌడ్, సీహెచ్ ఉపేంద్ర బృందం శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో భేటీ అయ్యింది. బీసీల రిజర్వేషన్ల పెంపు, కులగణన, పథకాలు తదితర అంశాలపై అధ్యయనం కోసం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ బృందం తమిళనాడులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజున చెన్నైలోని తమిళనాడు సచివాలయంలో సీఎం స్టాలిన్ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ముఖ్యమంత్రిని శాలువాతో సన్మానించి, పలు పుస్తకాలను అందజేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల శాతం స్థిరీకరణ, సమాచార సేకరణలో అవలంబించాల్సిన పద్ధతులపై అధికారులతో సమగ్ర డాటా సేకరిస్తున్నట్టు స్టాలిన్కు వివరించారు. అంతకుముందు తమిళనాడు బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ తనికాచలం, బీసీ, ఎంబీసీ, మైనార్టీ శాఖల మంత్రి రాజకన్నప్పన్ , ముఖ్యకార్యదర్శి కార్తిక్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి అముద, ఇతర ముఖ్య అధికారులతో సమావేశమై అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సత్తనాథన్, అంబాశంకర్, జనార్దనం కమిషన్ నివేదికలపై సమాలోచనలు జరిపారు. అనంతరం చెన్నై ఈవీకే సంపత్ రోడ్లో ఉన్న ద్రవిడ ఉద్యమ దిగ్గజం, ప్రముఖ సంఘ సంసర్త పెరియార్ ఈవీ రామస్వామి స్మృతిచిహ్నాన్ని బీసీ కమిషన్ బృందం సందర్శించి నివాళులు అర్పించింది.