హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థుల్లో అత్యధికులు పైతరగతులకు ప్రమోట్ అవుతున్నారు. ప్రాథమిక నుంచి ప్రాథమికోన్నత తరగతుల్లోకి 97.01 శాతం మంది విద్యార్థులు చేరుతున్నారు. ఎలిమెంటరీ నుంచి సెకండరీకి ప్రమోట్ అయ్యే వారి శాతం 96.29గా ఉన్నది. ఈ విషయాన్ని సోషియో ఎకనామిక్ సర్వే 2021-22లో ప్రభుత్వం వెల్లడించింది.
బాలికల చదువులో 5 నుంచి 6 వ తరగతిలో జాతీయంగా 93.37 శాతం కాగా, తెలంగాణలో 97.31 శాతంతో ఉత్తమంగా ఉన్నది. ఎలిమెంటరీ నుంచి సెకండరీకి ప్రమోట్ అవుతున్న వారి రేటు జాతీయంగా 87.84 శాతంగా ఉం డగా, తెలంగాణలో 96.63 శాతం నమోదైంది. 2021- 22 మధ్యకాలం లో రాష్ట్రంలో కేజీ టు పీజీలో భాగంగా 86 గురుకులాలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశారు. 4 బీసీ గురుకులాలు, 75 ఎస్సీ గురుకులాలు, 7 ఎస్టీ గురుకులాలను అప్గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. సర్కారీ బడుల్లో ప్రవేశాలు ఏటా పెరుగుతున్నాయి. ప్రైవేట్ బడుల్లో నమోదు తగ్గుతున్నది.