Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో బిహార్లో అనూహ్య ఫలితాలు వస్తాయని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబడతామనే విశ్వాసం తమ పార్టీకి ఉందని స్పస్టం చేశారు. ప్రజాస్వామ్య మహాపోరుకు ఆర్జేడీ సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
గత పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల అలక్ష్యం వహించిందనేది ప్రజల్లో గూడుకట్టుకుందని, ఈ అసంతృప్తి రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా వెల్లడవుతుందని అందుకే ఆశ్చర్యకర ఫలితాలు వస్తాయని తాను చెబుతున్నానని అన్నారు. కాషాయ నేతలు ఏమైనా చెబుతారు..కానీ బిహార్లో ఎన్నికల ఫలితాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయి..తమ హయాంలో 17 నెలల కాలంలో జరిగిన పనులు గత 17 ఏండ్లలో కూడా జరగలేదని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు.
గత పదేండ్లుగా బిహార్కు ప్రధాని మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. బిహార్కు ఎలాంటి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు..ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్తో పాటు బిహార్లో మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్ జరుగుతుంది.
Read More :
కాంట్రాక్టర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి : కేసు నమోదు చేసిన పోలీసులు