Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ వ్యవస్ధలన్నింటినీ నాశనం చేశారని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం పట్నాలో విలేకరులతో మాట్లాడారు.
ప్రధాని మోదీ బిహార్కు వచ్చి తమను బెదిరిస్తున్నారని, తమను జైలుకు పంపుతామని చెబుతున్నారని అన్నారు. ప్రధాని తాను న్యాయస్ధానాల కంటే అధికమని భావిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మాటలతో ప్రభుత్వ ఏజెన్సీలు ఆయన కనుసన్నల్లో నడుస్తున్నాయని స్పష్టమైందని అన్నారు.
మోదీ హయాంలో ప్రభుత్వ వ్యవస్ధలు, దర్యాప్తు సంస్ధలకు విలువ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వారిని అరెస్ట్ చేయాలి..వీరిని విడిచిపెట్టాలని చెప్పడమే ప్రధాని పనిలా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్ధలను ప్రధాని మోదీ నీరుగారుస్తున్నారని తేజస్వి యాదవ్ మండిపడ్డారు.
Read More :
Drunk Man | మద్యం మత్తులో డ్రైనేజీ పైపులోకి తాగుబోతు.. చివరికి ఏమైందంటే..Video