Loksabha Elections | బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రానున్న లోక్సభ ఎన్నికల సందర్భంగా పేదరికం, నిరుద్యోగం వంటి కీలకాంశాలపై చర్చ జరగాలని అన్నారు.
మోదీ సర్కార్ పదేండ్ల కాలంలో యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారని ప్రశ్నించారు. దేశంలో పేదరికాన్ని ప్రధాని మోదీ ఎందుకు నిర్మూలించలేదని నిలదీశారు. బిహార్కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని పాలక బీజేపీని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు.
ఆకలి, నిరుద్యోగం, ధరల మంట సామాన్యుడిని సతమతం చేస్తున్నాయని, దీనిపై కాషాయ పాలకులు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. యువతకు ఉపాధి కల్పించడంలో మోదీ సర్కార్ విఫలమైందని ఆరోపించారు.
Read More :
Evening Walk | సాయంత్రం వేళ వ్యాయామం.. వారికి ఎంతో ప్రయోజనం