పాట్న : లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) సొంత పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పై కోపంగా ఉన్నారు. తమ్ముడు తేజస్వితో తేజ్ ప్రతాప్కు పొసగడం లేదు. తేజ్ ప్రతాప్ నిరంతరం తమ్ముడిని సోషల్ మీడియాలో దూషిస్తూనే ఉంటాడు. పార్టీలో పైచేయి సాధించేందుకు తేజ్ప్రతాప్.. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ‘విద్యార్థి జన్శక్తి పరిషత్’ను ఏర్పాటు చేశారు. ఈ పరిషత్కు తనకు తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు.
ఆర్జేడీ పార్టీలో భాగంగానే ఉంటూ.. విద్య, ఆరోగ్యం, నిరుద్యోగ సమస్యలపై విద్యార్థి జన్శక్తి పరిషత్ పోరాడుతుందని తేజ్ ప్రతాప్ చెప్పారు. ఆర్జేడీని బలోపేతం చేయడమే తమ పరిషత్ లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్జేడీ పార్టీ విద్యార్థి విభాగం సరైన మార్గంలో నడవడం లేదని, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి జన్శక్తి పరిషత్ ఉద్యమం బిహార్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతుందని, ఈ మిషన్లో చేరాలని యువతకు ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలోనే సభ్యత్వాలు చేపడతామని, విశ్వవిద్యాలయాల్లో క్యాంపులు నిర్వహించి విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు.
తాలిబాన్ క్రూరం.. మాజీ మహిళా పోలీసు అధికారి దారుణహత్య
లాహోర్ను ముట్టడించిన భారత సేనలు
ఈ నెల 15 న పౌరుల తొలి అంతరిక్ష యాత్ర
ఏవీ లేని ఈ కాటేజ్కు రూ.5.5 కోట్లు.. ఎందుకో తెలుసా..?
107 భాషలు ఈ జిల్లాలో మాట్లాడతారు.. ఏ జిల్లానో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..