హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీజీఎండీసీ)కి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,008 కోట్ల ఆదాయం సమకూరిందని సంస్థ వైస్ చైర్మన్ అండ్ ఎండీ భవేశ్ మిశ్రా తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2024-25తో పోలిస్తే టీజీఎండీసీ 36% వృద్ధిని నమోదు చేసినట్టు వివరించారు.