న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: సంస్థలో కృత్రిమ మేధ (ఏఐ)ను విస్తృతంగా వినియోగించడానికి టెక్ కంపెనీ యాక్సెంచర్ పలు చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా సీనియర్ ఉద్యోగులు తప్పక ఏఐ టూల్స్ నేర్చుకోవాలని, విధి నిర్వహణలో వాటి వినియోగాన్ని తప్పనిసరి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. లేకపోతే తమ స్థానాలకు భంగం కలుగవచ్చునన్న సంకేతాలను పంపింది.
కొంతమంది మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్లు వారానికి ఎన్నిసార్లు ఏఐ టూల్స్ను వినియోగిస్తున్నారో డాటా సేకరిస్తున్నది. నాయకత్వ పదవికి ప్రమోషన్ పొందాలంటే ఏఐ టూల్స్ ఉపయోగించడం తప్పనిసరి అన్న సంకేతాలను సంస్థ పంపింది. యాక్సెంచర్కు ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.