న్యూఢిల్లీ: ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఇవాళ్టి నుంచి కోవిడ్ ఆంక్షలను సడలిస్తున్నారు. ఏప్రిల్ రెండవ వారం నుంచి ఈ రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. యూపీలోని వారణాసిలో కోవిడ్ నిబంధనలను సడలించారు. స్థానిక టీ షాపు ఓనర్ 40 రోజుల తర్వాత మళ్లీ షాపును తీసినట్లు చెప్పాడు. కేవలం 15 శాతం మంది మాత్రమే బయటకు వస్తున్నట్లు అతను వెల్లడించాడు. నగరంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం వచ్చిందని, కానీ కోవిడ్ నిబంధనలు పాటించనున్నట్లు ఒకరు తెలిపారు. మహారాష్ట్రలోని పూణెలో జిమ్లు, సెలూన్లు తెరుచుకున్నాయి. ఆంక్షలను ప్రభుత్వం సడలించడంతో మళ్లీ జనం జిమ్లకు వస్తున్నారు. దళ వారీగా సడలింపులు ఉంటాయి. ఢిల్లీలో కూడా మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి.