ముంబై: ఈ నెల 22న జరగనున్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్) 86వ స్నాతకోత్సవానికి టాటా మోమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ ప్రమేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. అంతకు మందు ఆగస్టు 2న నిర్వహించ తలపెట్టిన స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది.
అయితే సీజేఐ వస్తే విద్యార్థుల నుంచి నిరసనలు తలెత్తవచ్చనే భావనతో వర్సిటీ అధికారులు స్నాతకోత్సవాన్ని వాయిదా వేశారు. కాగా ఆగస్టు 22న జరిగే స్నాతకోత్సవానికి జస్టిస్ సూర్యకాంత్ హాజరు కాలేరని, నవంబర్ వరకు ఆయన షెడ్యూల్ బిజీగా ఉందని సీజేఐ కార్యాలయం తెలిపింది.