తమిళనాడులో ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్లో విద్యార్థిని మృతికి నిరసనగా ఆమె బంధువులు, కుటుంబ సభ్యులుసహా వందలాది మంది ఆందోళనకారులు ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్పై మూకదాడికి దిగారు. బస్సులను తగులబెట్టారు. స్కూల్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పోలీసులను కూడా లక్ష్యంగా చేసుకొని, దాడికి పాల్పడ్డారు. పోలీసు కారును ధ్వంసం చేశారు ఈ సంఘటన తమిళనాడులోని కళ్లకురిచ్చిలో జరిగింది.
కళ్లకురిచ్చికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నసేలంలోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలిక జూలై 13న హాస్టల్ ప్రాంగణంలో శవమై కనిపించింది. హాస్టల్లోని మూడో అంతస్తులోగల ఓ గదిలో ఉంటున్న బాలిక ఆత్మహత్య చేసుకున్నది. పై అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలై చనిపోయింది. బాలిక మృతికి ఆ స్కూల్ యాజమాన్యమే కారణమని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కడలూరు జిల్లా వేప్పూర్లోని పెరియనాసలూరు గ్రామానికి చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో స్కూల్ వద్దకు తరలివచ్చారు. విధ్వంసం సృష్టించారు. సదరు పాఠశాల అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు. నిందితులకు తప్పకుండా శిక్షపడుతుందని హామీ ఇచ్చారు. హింసాత్మక ఘటన తనను కలవరపెడుతోందన్నారు. బాలిక మృతిపై పోలీసుల విచారణ పూర్తికాగానే నిందితులను శిక్షిస్తామన్నారు. వెంటనే కళ్లకురిచ్చికి వెళ్లాలని డీజీపీ, హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు. శాంతియుతంగా ఉండాలని ఆందోళనకారులను కోరారు.
#WATCH Tamil Nadu | Violence broke out in Kallakurichi with protesters entering a school, setting buses ablaze, vandalizing school property as they sought justice over the death of a Class 12 girl pic.twitter.com/gntDjuC2Zx
— ANI (@ANI) July 17, 2022