ED | తమిళనాడులో రూ.207కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. మనీలాండరింగ్ కేసులో జప్తు చేసినట్లు ఈడీ ఆదివారం వెల్లడించింది. తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్కు చెందని ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. నియో మ్యాక్స్ గ్రూప్ కంపెనీలు ఇతర బయటి గ్రూపుల్లో పెట్టుబడి పెట్టి ఇన్వెస్టర్లను మోసానికి పాల్పడిందని.. దాన్ని దాచేందుకు కంపెనీ అనేక వ్యూహాలు పన్నిందని ఆరోపణలున్నాయి. ఖాతాలకు సంబంధించిన రికార్డుల్లో అవకతవకలు జరిగాయని ఈడీ పేర్కొంది. గ్రూప్ ఆడిటర్ సైతం దీన్ని అంగీకరించారు. నియో మ్యాక్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్పై ఇన్వెస్టర్లు చేసిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అధిక ఆదాయం ఆశచూపి.. అనేక ప్రాజెక్టుల్లో రూ.లక్షలాది సొత్తును డిపాజిట్ల పేరుతో పెట్టుబడిదారులను మోసం చేసినట్లు ఈడీ పేర్కొంది.