చెన్నై : కరోనా కట్టడికి అమల్లో ఉన్న లాక్డౌన్ ను జూన్ 7 వరకూ పొడిగించనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుత లాక్డౌన్ కు ఎలాంటి సడలింపులు ఉండవని జూన్ 7 వరకూ ఇవే నియంత్రణలు కొనసాగుతాయని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. కిరాణా దుకాణాలు ఉదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకూ ఆర్డర్లు తీసుకుని సరుకులను కస్టమర్ల ఇంటికి చేర్చేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు.
జూన్ మాసంలో రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు 13 నిత్యావసర వస్తువులతో కూడిన కిట్ ను అందచేస్తామని తెలిపారు. లాక్డౌన్ నియంత్రణలతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా పూర్తి సంతృప్తికరమైన ఫలితాలు రాలేదని స్టాలిన్ పేర్కొన్న నేపథ్యంలో తాజాగా లాక్డౌన్ మరో వారం పొడిగించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.