న్యూఢిల్లీ: తమిళనాడులో అధికార డీఎంకే, రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య నెలకొన్న వివాదంపై సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్ రఘుపతి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసి మెమోరాండం అందించారని డీఎంకే పార్లమెంటరీ పార్టీ నాయకుడు టీఆర్ బాలు మీడియాతో చెప్పారు. ఆ వినతిపత్రంలో ఏం రాశారో వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. అందులో ఏముందో ముఖ్యమంత్రికి మాత్రమే తెలుసునన్నారు. అనంతరం మెమెరాండంలోని ప్రధాన అంశాలను ప్రభుత్వం విడుదల చేసింది. గవర్నర్ ఆర్ఎన్ ర.. ప్రభుత్వంతో రాజకీయ భావజాల ఘర్షణకు దిగుతున్నారని, ఈ వైఖరిని మార్చుకునేలా గవర్నర్కు సూచించాలని స్టాలిన్ రాష్ట్రపతిని కోరారు.
రాజ్యసభలో గవర్నర్ ప్రసంగం, అనంతర పరిణామాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠం నుంచి పక్కదోవ పట్టారని, తన ప్రసంగంలో అంబేడ్కర్, పెరియార్, అన్నాదురై, కరుణానిధి పేర్లు, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం వంటి అంశాలను చెప్పలేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా తనకిచ్చిన పాఠం నుంచి పక్కదోవ పట్టడం, పొంగల్ ఆహ్వానంలో రాష్ట్ర చిహ్నాన్ని ముద్రించకపోవడం వంటి చర్యలపై తమిళ ప్రజలు గవర్నర్ రవిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గవర్నర్ను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది.