చెన్నై : తమిళనాడు రాజ్భవన్ మెయిన్ గేట్పై ఓ వ్యక్తి పెట్రోల్ బాంబులు విసిరిన ఘటనపై రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి స్పందించారు. రాజభవన్పై పెట్రో బాంబు దాడి ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకోవడం లేదని తమిళనాడు రాజ్భవన్ విస్మయం వ్యక్తం చేసింది. ఈ దాడిపై రాజ్భవన్ ఫిర్యాదును పోలీసులు స్వీకరించడం లేదని, కేవలం విధ్వంస ఘటనగా దీన్ని పరిగణిస్తూ కొట్టిపారేస్తున్నారని ఆరోపించింది.
సూమోటోగా కేసు నమోదు చేసి హడావిడిగా నిందితుడిని అరెస్ట్ చేసి అర్ధరాత్రి జైలుకు తరలించారని పేర్కొంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగితే దాడి వెనుక ఎవరున్నారో తెలిసే అవకాశం ఉందని, దర్యాప్తును అడ్డుకుంటే వాస్తవాలు వెలుగుచూడవని రాజ్భవన్ తెలిపింది.
దర్యాప్తు ప్రారంభం కాకుండానే నిష్పాక్షిక దర్యాప్తు ముందుకు కదలకుండా చంపేశారని తమిళనాడు రాజ్భవన్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం వద్ద జరిగిన ఘటన పట్ల పాలక డీఎంకే సర్కార్పై విపక్ష ఏఐఏడీఎంకే, బీజేపీ విరుచుకుపడ్డాయి. ఈ ఘటనపై ఎన్ఐఏచే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది.
Read More :
Cyber Fraud | జ్యూవెలరీ స్టోర్ ఈమెయిల్ ఐడీ చోరీ : రూ 18 లక్షలు కొట్టేసిన స్కామర్లు