చెన్నై, జూలై 7: కుల రహిత సమాజమే తమ లక్ష్యమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
ఓ సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అన్ని కులాలకు చెందిన వారిని ఆలయాల్లో పూజారులుగా నియమించేందుకు కరుణానిధి ప్రయత్నాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నదని తెలిపారు.