Mamata Banerje | మాతృమూర్తి మృతితో బాధలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కొంచెం రెస్ట్ తీసుకోవాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సూచించారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ శుక్రవారం బెంగాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే తల్లి హీరాబెన్ మృతితో ఆయన వర్చువల్గా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మోదీకి దీదీ ఈ విధంగా సూచనలు చేసింది.
‘ప్లీజ్ కొంచెం విశ్రాంతి తీసుకోండి. మీ తల్లి మరణానికి ఎలా సంతాపం చెప్పాలో నాకు తెలియట్లేదు. మీ అమ్మ మా అమ్మ. ఈ సమయంలో నేను నా తల్లిని గుర్తుచేసుకున్నా’ అని ప్రధానమంత్రితో అన్నారు.
మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ శుక్రవారం తెల్లవారుజామున 3.39 గంటలకు కన్నుమూశారు. ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్న ఆమె.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం రాత్రి అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే, హీరాబెన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, రెండు లేదా మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఆమె ఈ లోకాన్ని విడిచివెళ్లారు.