న్యూఢిల్లీ: గాంధీ-నెహ్రూ కుటుంబానికి ఎంతో కీలకమైన అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ రెండింటి నామినేషన్ల గడువు ఇంకా మూడురోజులే ఉంది.
అమేథీ, రాయ్బరేలీలలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కాగా, గాంధీ కుటుంబ సభ్యులనే ఇక్కడ పోటీకి దించాలంటూ అమేథీలో మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. ఇలావుండగా, హర్యానాలోని గురువావ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నటుడు, రాజకీయ వేత్త రాజ్బబ్బర్ను, హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాకు కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది.