40% మంది తల్లిదండ్రుల అభిప్రాయం
పియర్సన్ గ్లోబల్ లెర్నర్స్ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 5: సామాజిక మాధ్యమాలు, వీడియో గేమ్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న అంశంపై నిర్వహించిన పియర్సన్ గ్లోబల్ లెర్నర్స్ సర్వేలో తల్లిదండ్రులు మిశ్రమంగా స్పందించారు. వీడియో గేమ్లు పిల్లలకు మంచివేనని, వాళ్ల మానసిక సామర్థ్యం పెరుగుతుందని సర్వేలో పాల్గొన్న 40% మంది తల్లిదండ్రులు సమాధానం ఇచ్చారు.
సామాజిక మాధ్యమాల వల్ల పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయని 28% మంది చెప్పారు. ఏప్రిల్ నెలలో అమెరికా, యూకే, బ్రెజిల్, చైనా, ఇండియాలో ఈ సర్వే నిర్వహించారు. మొత్తం 3,100 మందిపై సర్వే నిర్వహించగా స్కూళ్లలో మానసిక ఆరోగ్య సేవలు కల్పించాలని 92% మంది అభిప్రాయపడ్డారు.
వీడియో గేమ్లు పిల్లల మానసిక సామర్థ్యాన్ని పెంచుతాయి – 40%
సోషల్ మీడియాతో పిల్లల తెలివితేటలు పెరుగుతాయి – 28%
వర్చువల్ లెర్నింగ్ పిల్లలకు మంచిదే – 27%
మానసిక ఆరోగ్యానికి ఆటలు, వ్యాయామం అవసరం – 88%