MLC Kavitha | న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 16కు విచారణ వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ తీరును తప్పుబడుతూ కవిత పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
సీఆర్పీసీ నిబంధనలు పాటించడంలేదని.. ఈడీ ఆఫీస్లో మహిళను విచారించడం సరికాదంటూ పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు.. అభిషేక్ బెనర్జీ కేసుతో జత చేస్తామని తెలిపింది. అన్ని పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ నెల 16న తుది విచారణ జరగనుంది.