Cheetah | న్యూఢిల్లీ, జూలై 20: ‘మీ సమస్య ఏమిటి? వాతావరణమా లేక ఇంకేమైనా ఉందా? 20 చీతాల్లో 8 మృత్యువాత పడ్డాయి. వాటిని వివిధ వన్యప్రాణి సంరక్షణాలయాలకు ఎందుకు తరలించకూడదు?’ అంటూ సుప్రీంకోర్టు గురువారం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
కునో జాతీయ పార్కులో చీతాల మరణాలపై విచారణ జరిపిన ధర్మాసనం.. దయతో కొన్ని సానుకూల చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. దీన్ని ప్రతిష్టకు సంబంధించిన విషయంగా ఎందుకు చూస్తున్నారని అడిగింది. చీతాల మరణాలపై సమగ్ర వివరాలను ఈ నెల 29లోగా అఫిడవిట్ సమర్పించమని ఆదేశించింది.