న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఖురాన్లో 26 శ్లోకాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని, వాటిని తొలగించాలని యూపీ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అది ముమ్మాటికి పనికిమాలిన పిటిషన్’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ రిషికేశ్ రాయ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను తిరస్కరించింది. పిటిషనర్పై రూ.50వేల జరిమానా విధించింది.