న్యూఢిల్లీ, నవంబర్ 2: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2023 సెప్టెంబర్ 23నాటి వరకు అందిన విరాళాల వివరాలు అందులో పొందుపరచాలని, రెండు వారాల్లోగా సమాచారాన్ని అందజేయాలని నిర్దేశించింది. ఎన్నికల బాండ్ల పథకం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వాయిదా వేసింది. 2019 వరకు బాండ్ల డాటా తమ వద్ద ఉందని ఈసీ తెలుపగా, అలా కాదు.. ధర్మాసనం ముందుకు ఎప్పుడు వచ్చినా తాజా సమాచారంతో రావాలని ఈసీకి సూచించింది.