న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఎన్నికల వేళ మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఉచితాలు పంపిణీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై నాలుగు వారాల్లో స్పందన తెలపాలని మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, ఆర్బీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఓటర్లకు గాలం వేసేందుకు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగం చేస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.