న్యూఢిల్లీ: వైద్యంలో ఉన్నత విద్య ప్రవేశానికి నిర్వహించే నీట్ పీజీ-2023 పరీక్షను వాయిదా వేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పరీక్ష తొలుత నిర్ణయించిన విధంగా మార్చి 5నే నిర్వహించాలని ఆదేశించింది.
ఈ ఏడాది ఎంబీబీఎస్ చదువుతున్న చాలామందికి ఇంటర్న్షిప్ పూర్తి కానందున, విద్యార్థులు పరీక్ష ప్రిపరేషన్కు సమయం లేనందున పరీక్షను ఏప్రిల్ లేదా మేకు వాయిదా వేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. పరీక్ష వాయిదాను కోర్టు తిరస్కరించింది. మార్చి 5నే పరీక్ష నిర్వహించాలని తీర్పు ఇచ్చింది.