న్యూఢిల్లీ, జూన్ 24: ప్రైవేట్ వైద్య కళాశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను ఈడబ్ల్యూఎస్ అర్హత కోసం నిర్ణయించిన రూ.8 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని ఎలా సమన్వయం చేసుకోవచ్చని ప్రశ్నిస్తూ ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూస్) చెందిన ఒక అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. రాష్ట్ర రెగ్యులేటరీ కమిటీ ఖరారుచేసిన ఫీజుల విధానం చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని గుర్తిస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.
ప్రభుత్వ కళాశాలలతో సమానంగా ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు ఉంటాయని ఆశించరాదని విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న అన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ క్యాపిటేషన్ ఫీజు రద్దయింది కాబట్టి సాధారణ కాలేజీ ఫీజులు కూడా తీసుకోరాదంటే ఎలా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఒకవేళ మీరు చెల్లించలేకపోతే ఉపకారవేతనం లేదా ఆర్థిక సహాయం పొం దండి అని పిటిషనర్ సూచించారు.