ఢిల్లీ, మార్చి 27 (నమేస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభలు తీర్మానించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవటాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. తెలంగాణ గవర్నర్తో చర్చలు జరిపి పెండింగ్లో ఉన్న పది బిల్లులపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. ఏప్రిల్ 10న జరిగే విచారణలో చర్చల పురోగతిని వివరించాలని సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ జేబీ పార్ధిలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఈ ఆదేశాలను జారీ చేసింది.
రా ష్ట్ర శాసనసభ ఆమోదించిన పది బిల్లులను ప్రభుత్వం గవర్నర్కు పంపిందని, వాటికి గవర్నర్ ఆమోదం చెప్పకుండా తన వద్ద దీర్ఘకాలంగా పెండింగ్లో పెట్టుకోవటం రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యా జ్యంపై తదుపరి విచారణ ఏప్రిల్ 10కి వాయి దా వేసింది. పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ గవర్నర్తో కొంత మేరకు చర్చలు జరిపామని, విచారణను వాయిదా వేస్తే తదుపరి విచారణలో చర్చల పురోగతిని తెలియజేస్తామని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
తెలంగాణలో మాత్రమే జాప్యమెందుకు?
తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వా దనలు వినిపిస్తూ, మధ్యప్రదేశ్ గవర్నర్ ఏడు రోజుల్లో బిల్లులకు ఆమోదం తెలుపుతారని, గుజరాత్ గవర్నర్ నెల రోజుల్లో బిల్లులకు ఆమోదం చెబుతున్నారని ఉదహరించారు. తెలంగాణలో మాత్రమే తీవ్ర జాప్యం అవుతున్నదని వివరించారు. ఈ విషయంపై సొలిసిటర్ జనరల్ ద్వారా కచ్చితమైన వివరణ తీసుకోవాలని కోరారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించడం వెనుక గవర్నర్ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మంత్రివర్గం సిఫార్సులు, ఆమోదాలకు అనుగుణంగా గవర్నర్ పనిచేయాలని గతం లో సుప్రీంకోర్టు తీర్పులు చెప్పిందని, రెండు రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులను గుర్తు చేశారు. తప్పుడు సంకేతాలు వెలువడేలా వాతావరణం ఉండరాదని కోరారు.
అధికారాలకనుగుణంగా ఉత్తర్వులివ్వాలి
అసెంబ్లీ ఆమోదించిన అనేక బిల్లులపై చర్య తీసుకోవటానికి గవర్నర్ నిరాకరించటం వల్ల ‘రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతున్నందున రాజ్యాంగంలోని 32వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలకు అనుగుణం గా ఉత్తర్వులు ఇవ్వాలని దుష్యంత్ దవే సుప్రీంకోర్టును కోరారు. గవర్నర్ ప్రభుత్వ నిర్ణయాల కు అనుగుణంగా పని చేయాలేగానీ వ్యక్తిగత అ భిప్రాయాల మేరకు చేయకూడదని చెప్పారు.