Pawan Kheda | కాంగ్రెస్ అగ్రనేత పవన్ ఖేడాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో పవన్ ఖేడాపై నమోదైన ఎఫ్ఐఆర్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ను రద్దు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. కాంగ్రెస్ నేతపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేసేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించగా.. ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపిన కోర్టు.. ఆయన అభ్యర్థనను తిరస్కరించింది.
జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుపై జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగా.. పవన్ ఖేడాపై హజ్రత్గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన వ్యాఖ్యలపై అసోం, ఉత్తరప్రదేశ్లో మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాటిని లక్నోలోని హజ్రత్గంజ్ పోలీస్స్టేషన్కు మార్చిలో సుప్రీంకోర్టు బదిలీ చేయడంతో పాటు బెయిల్ను పొడిగించింది.
విమానాశ్రయంలో ఆయనను అరెస్టు చేయగా.. మధ్యంతర బెయిల్పై విడుదల చేసింది. ఫిబ్రవరి 23న ఢిల్లీ విమానాశ్రయంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా అరెస్ట్ అయ్యారు. రాయ్పూర్కు వెళ్లే విమానం నుంచి ఆయనను దింపి వేయగా.. నాటకీయ పరిణామాల మధ్య పవన్ ఖేడాకు అదే రోజున సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత పొడిగిస్తూ వచ్చింది.