కొవిడ్ అనాథ బాలుడి కేసులో సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ, జూన్ 9: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథ అయిన ఆరేండ్ల బాలుడిని అతడి తాతకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కరోనాతో 2021 మే 13న తండ్రి, జూన్ 12న తల్లి మరణించారు. దీంతో బాలుడి బాధ్యతను అతడి చిన్నమ్మకు అప్పగిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
అయితే, తమ మనుమడి బాధ్యతలు తమకు అప్పగించాలని బాలుడి తాత, నానమ్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో.. వారికే అప్పగిస్తూ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. బాలుడి చిన్నమ్మకు ప్రభుత్వ ఉద్యోగం, ఉమ్మడి కుటుంబం ఉన్నా, తాత, నానమ్మ ఆ బాలుడిని బాగా చూసుకొంటారని, వారి మధ్య భావోద్వేగ బంధం ఉంటుందని అభిప్రాయపడింది.