భువనేశ్వర్: ఒడిశాలోని బరిపడలో మహరాజ శ్రీరామ్ చంద్ర భం దేవ్ యూనివర్సిటీలో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తుండగా.. హఠాత్తుగా కరెంట్ పోయింది. దీంతో అక్కడంతా అంధకారం చోటుచేసుకుంది.
మధ్యా హ్నం 11.56 నుంచి 12.05 గంటల వరకు తొమ్మిది నిముషాలు పాటు విద్యుత్తు లేకున్నా ఆమె డిమ్ లైట్లోనే తన ప్రసంగాన్ని కొనసాగించడంతో కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రపతి.. యూనివర్సిటీ దాని అందంలా చీకటిలో ఉన్నదని వ్యాఖ్యానించారు.