Subramanian Swamy | మనీలాండరింగ్ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. పీఎంఎల్ఏపై సుప్రీంకోర్టు నిర్ణయం ‘కోడి తనంతట తానే ఫ్రై అయ్యేందుకు వచ్చినట్టుంది’ అంటూ పీ చిదంబరంతో పాటు ఇతర నేతలపై సుబ్రహ్మణ్య స్వామి సెటైర్లు వేశారన్నారు. యూపీఏ ప్రభుత్వంలో పీ చిదంబరమే ఈడీకి అధికారాలు కట్టబెట్టారు.
పీఎంఎల్ఏ చట్టలోని నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. చట్టం ప్రకారం పనిచేసే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన దర్యాప్తులో భాగంగా చేస్తున్న సోదాలు, అరెస్టులు, ఆస్తుల సీజ్ వంటి అన్ని చర్యలను సుప్రీంకోర్టు సమర్థించింది. కారణాలు చెప్పకుండానే నిందితులను అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదన్న వాదనను.. విచారణ సమయంలో బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేస్తోందన్న కార్తీ చిదంబరం, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీతో పాటు పలువురు కోర్టు దృష్టికి తీసుకురాగా ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
కోర్టు తీర్పు అనంతరం బీజేపీ స్పందించింది. నిజాలను దాచిపెట్టే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ సత్యాగ్రహ పేరుతో నిరసనలు చేపడుతుందోని బీజేపీ జాతీయ జేపీనడ్డా విమర్శించారు. వారంతా ఓ కుటుంబాన్ని కాపాడేందుకే నిరసనలు చేపడుతున్నారని, దేశం కాదన్నారు. దర్యాప్తు సంస్థలకు గాంధీల కుటుంబం సమాధానం చెప్పాల్సిందేనని.. కానీ, వారు చట్టానికి అతీతం అని భావిస్తుంటారని విమర్శించారు.