ముంబై : ఉక్రెయిన్ నుంచి భారత్కు వచ్చే విద్యార్థులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సిబ్బంది ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టు స్పెషల్ కారిడార్ను మూసివేశామని పేర్కొన్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా నెగిటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టు చూపించాలని తెలిపారు. ఒక వేళ ఈ రెండు పత్రాలు చూపించని యెడల, అలాంటి విద్యార్థులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ఆ ఖర్చు ఎయిర్పోర్టు అధికారులే భరిస్తారని చెప్పారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవచ్చు. ఒక వేళ ఎవరికైనా పాజిటివ్ అని తేలితే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సదరు వ్యక్తిని క్వారంటైన్లో ఉంచుతామని ప్రకటించారు.
The airport has blocked a special corridor for Indians arriving from Ukraine later today. They’ll be required to produce either a Covid-19 vaccination certificate/negative RT-PCR report on arrival: Chhatrapati Shivaji Maharaj International Airport, Mumbai
— ANI (@ANI) February 26, 2022