ముంబై, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘మరాఠా సమాజానికి తొందరగా రిజర్వేషన్ ఇవ్వండి.. నా బలిదానం వ్యర్థం కాకుండా చూడండి’ అని కోరుతూ తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాందేడ్ జిల్లా సోమేశ్వర్కు చెందిన కోమల్ బోకరే (14) గురువారం ఉరేసుకోగా తల్లిదండ్రులు ఆమెను తొలుత దగ్గర్లోని దవాఖానకు, అనంతరం నాందేడ్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాలిక చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించింది. కోమల్ తండ్రి రైతు కూలీ కాగా, ఐదుగురు ఆడపిల్లల్లో ఆమె రెండోవారు. మరాఠా రిజర్వేషన్ కోసం గ్రామంలో రిలే నిరాహార దీక్షలు జరగ్గా, కోమల్ అందులో పాల్గొన్నట్టు గ్రామస్థులు తెలిపారు.