అహ్మదాబాద్ : పానీ పూరీ అంటే పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. ఈ స్ట్రీట్ ఫుడ్ సెన్సేషన్ మనలో చాలా మందికి స్నాక్ కంటే ఎక్కువ. దేశవ్యాప్తంగా పానీ పూరీ అంటే అందరూ దాని క్రేజీ టేస్ట్కు ఫిదా అవుతుంటారు. ఇక సూరత్లో ఓ స్ట్రీట్ ఫుడ్ వెండర్ రూ. 20కే రగడ పానీ పూరీ ఆఫర్ చేస్తున్న వీడియో (Viral Video) సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఈ ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్ను వ్యాపారి తయారుచేస్తున్న వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతా బాగానేఉన్నా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వలేదని నెటిజన్లు పెదవివిరిచారు. ఈ వైరల్ క్లిప్లో వ్యాపారి భారీ పాత్రలో ఉడకపెట్టిన పల్లీలు, ఆలు, చింతపండు నీరుతో పాటు పలు మసాలా దినుసులను మిక్స్ చేయడం చూడొచ్చు.
పూరీలో చింతపండు వాటర్, ఆనియన్స్, చట్నీలను ఫిల్ చేసి కస్టమర్లకు సర్వ్ చేయడం కనిపిస్తుంది. ఈ డిష్ ఆకట్టుకున్నా దాన్ని తయారుచేసే క్రమంలో వ్యాపారి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వలేదని నెటిజన్లు రుసరుసలాడారు. వ్యాపారి గ్లౌజ్ వేసుకోకుండా ప్రతిసారీ చేయిని ఉపయోగించాడని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, వారికి పరిశుభ్రత అంటే పడదా అని మరో యూజర్ ప్రశ్నించారు. ఈ స్నాక్ తయారుచేయడం చూస్తుంటే నాకు వాంతి వస్తోందని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :
BJP Leader | బీజేపీ నాయకుడి ఇంట్లో విదేశీ మద్యం.. 14 వేల బాటిల్స్ సీజ్